వైసీపీ షాక్..తూర్పు రాయలసీమలో టీడీపీ విజయం

-

MLC ఎన్నికల్లో టిడిపికి మరో విజయం దక్కింది. తూర్పు రాయలసీమ కూడా ఆ పార్టీ వశమైంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి 50 శాతానికి పై గా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. అనంతరం కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఇప్పటికే  ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం అయింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు విజయం సాధించారు. వేపాడ విజయాన్ని మొదట ప్రకటించని.. ఎన్నికల సంఘం….ఆ తర్వాత ధృవీకరించింది. ఎమ్.ఎల్.సి.గా వేపాడ చిరంజీవి రావుకు నియామక పత్రం విడుదల చేసింది ఈసీ.

Read more RELATED
Recommended to you

Latest news