ల్యాండ్ మాఫియాలో తెలంగాణ నెంబర్ వన్ : తరుణ్ చుగ్

-

నిరుద్యోగులను దగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 24 గంటల నిరహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సంఘీభావం తెలిపారు. అనంతరం తరుణ్ చుగ్ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యలపై తాము చేస్తున్న పోరాటంతో అయినా కేసీఆర్ సర్కార్ నిద్ర లేవాలన్నారు. చెవిటి, గుడ్డి ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అత్యాచారాన్ని కేసీఆర్ కుటుంబాన్ని పారదోలాలని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని.. ఏది కూడా నెరవేర్చలేదని తీవ్రంగా మండిపడ్డారు. నవంబర్ తో తెలంగాణకు పట్టిన కేసీఆర్ అనే మకిలీ వాడుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని వైట్ వాష్ చేసి పంపిస్తారని తెలిపారు. కేసీఆర్ ఇస్తానని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏవి..? కేసీఆర్ ది సిగ్గు, శరం లేని ప్రభుత్వం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు ఏది కేసీఆర్ ? ఎందరికీ ఇచ్చావు ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులను కేసీఆర్ ప్రభుత్వం అత్యాచారం చేస్తోందన్నారు. కేసీఆర్ ఒక రాజాబాబు అంటూ వ్యంగాస్త్రం వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news