అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత

-

రాజధాని అమరావతి రైతుల రెండవ విడత మహాపాదయాత్రలో శనివారం స్వల్ప ఉధృక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర గుడివాడలోకి చేరుకున్న సంగతి తెలిసిందే. గుడివాడ పట్టణంలోని శరత్ టాకీస్ సమీపానికి చేరుకోగానే రైతులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా థియేటర్ వద్ద ఉన్న వైసీపీ అభిమానులు జై వైసిపి అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య ఉధృక్తత చోటు చేసుకుందిుంది.

దీంతో కాసేపు ఉధృత వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వైసీపీ వర్గాలకు సర్ది చెప్పి అక్కడ నుంచి పంపేశారు. కాసేపటి తర్వాత వివాదం సర్దుమనిగింది. అయితే అమరావతి నుండి అరసవిల్లి వరకు అమరావతి రైతులు పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12వ తేదీన వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర నేడు కృష్ణాజిల్లా గుడివాడకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుడివాడలోని శరత్ టాకీస్ వద్దకి కి చేరుకోగానే ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news