బ్రేకింగ్: రాజధానికి మాకు ఏం సంబంధం లేదు, చెప్పేసిన కేంద్రం…!

-

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో అసలు కేంద్రం వైఖరి ఏంటీ అనే దానిపై చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో రాజధానికి మాకు ఏం సంబంధం లేదని కేంద్రం చెప్పేసింది. రాజధాని ఏర్పాటుపై సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసింది ఏపీ హైకోర్ట్ లో. రాజధాని ఏర్పాటు రాష్ట్రం పరిధిలోని అంశం…. ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదని పేర్కొంది.

రాష్ట్రవిభజన సమయంలో రాజధాని ఏర్పాటు పై అధ్యయనం చేసుందుకు కేంద్రం శివరామకృష్ణన్ కమిటీ వేసిందని చెప్పింది. కమిటీ రిపోర్ట్ ను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందని పేర్కొంది. 2015 లో ఎపి ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని అమరావతిగా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కేంద్రం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ డిసెంట్రలైజషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ యాక్ట్ 2020 ద్వారా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ గజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news