ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందజేసింది. వారానికి కేవలం ఐదు రోజుల పని దినాల కాల పరిమితి ఈ నెల 26వ తేదీన ముగుస్తుండగా దానిని మరో సంవత్సరం పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు వర్కింగ్ హవర్స్ ఉంటాయని వెల్లడించింది. సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు రాజధాని అమరావతి పరిధిలోని HoDలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు ఈ జీవో వర్తిస్తుందని వివరించారు.

దీంతో సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులు సంతోషపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకుని తాజా నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎక్కువ రోజులు పని చేయాల్సి ఉండగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఐదు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉండడంతో సంతోషపడుతున్నారు. ఇంకా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.