ఛీఛీ: కరోన శవంపై బంగారం కొట్టేసారు…!

-

ఒక పక్క కరోనా రావడమే దరిద్రం అనుకుంటే జరుగుతున్న కొన్ని సంఘటనలు బాధితులను మరింతగా కంగారు పెడుతున్నాయి. తాజాగా తిరుపతి లో ఒక ఘటన జరిగింది. కరోనాతో చనిపోయిన వ్యక్తి బంగారు నగలు, నగదు మాయం చేసారు కొందరు. తిరుపతి పద్మావతి హాస్పిటల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల వీర లక్షణ సింగ్ అనే వ్యక్తి తిరుపతి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.

అతను కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అతని శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలను మాయం చేసారు ఆస్పత్రి సిబ్బంది. మృతుని ఒంటిపై ఉన్న నగలు డబ్బు కూడా మాయం చేసారు. అధికారులకు బంధువులు ఫిర్యాదు చేసినా సరే లాభం లేకుండా పోయింది. ఇటీవల హైదరాబాద్ లో ఇదే తరహా ఘటన ఒకటి చోటు చేసుకుంది. కరోనా కష్టాలు భరించలేక ఇబ్బందులు పడుతుంటే ఇలాంటి దోపిడీ లు ఆందోళన కలిగిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news