బ్రేకింగ్:కరోనా రోగులకు జగన్ గుడ్ న్యూస్

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సిఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు కాస్త ఊరటను ఇస్తున్నాయి. తాజాగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా మృతుల కుటుంబాలకు సాయంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది ఏపీ సర్కార్. కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.15వేలు ఇవ్వాలని, అలాగే ప్లాస్మాను దానం చేసిన వారికి ఐదు వేలు అందివ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు.

jagan

ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తాజాగా జీవో జారీ చేశారు. ఈ నిధులకు గానూ ఆయా జిల్లా కలెక్టర్లకు రూ.12 కోట్లు విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ను ఆయన ఆదేశాలు ఇచ్చారు. వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. ప్లాస్మా విషయంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు కాస్త ముందు అడుగు వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news