ఉగ్రరూపం దాల్చిన ఉప్పాడ సముద్రం.. భయాందోళనలో ప్రజలు

-

కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్రం ఉగ్రరూపం దాల్చింది. నిన్నటి నుండి సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీచ్ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులను అలలు ముంచెత్తున్నాయి. దీనితో అటుగా వెళ్తున్న ప్రయానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఉన్నటుండి సముద్ర నీటి మట్టం పెరిగి సముద్రం ముందుకు వచ్చింది. దీనితో మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇది ఇలా ఉండగా మూలిగే నక్కపై తాటిపండు పడిందన్నట్టు నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడనం వాయుగుండంగా మారి తుపాన్ గా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. అలానే ప్రస్తుతం ఈ తుపాను ఈశాన్య దిశగా కదులుతుందని పేర్కొంది. కాగా ఇది పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్కు 380 కిలో మీటర్లు దూరంలోనూ అలానే బంగ్లాదేశ్కు నైరుతి దిశగా 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని.. ఈ ప్రభావం కారణంగానే ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారిందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news