విజయవాడ ప్రజలకు ఊరట..శాంతిస్తున్న కృష్ణమ్మ

-

విజయవాడ ప్రజలకు ఊరట లభించింది. సోమవారం రాత్రి నుంచి కాస్త కృష్ణమ్మ శాంతిస్తూ వస్తోంది. వర్షాలు పడటం తగ్గడంతో.. వరద కూడా తగ్గింది. దీంతో క్రమంగా కృష్ణా నది వరద ఉదృతి తగ్గుతోంది. ఇక 12 లక్షల క్యూసెక్కుల వరద నీటికి చేరకుండా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం తగ్గుతోంది.

The water level near Prakasam Barrage is receding without reaching 12 lakh cusecs of flood water

నిన్న రాత్రి 9 గంటలకు 11.13 లక్షల వరద ప్రవాహం కొనసాగింది. ఇవాళ ఉదయం 5 గంటల నాటికి 9.79 లక్షల క్యూసెక్కుల కు చేరి తగ్గింది వరద ప్రవాహం. ఇవాళ మధ్యాహ్నం సమయానికి బ్యారేజ్ దగ్గర మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అయినప్పటికీ చంద్రబాబు నిద్ర పోవడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news