AP: తంబళ్ళపల్లె TDP సీటుపై తీవ్ర గందరగోళం…!

-

AP: తంబళ్ళపల్లె TDP సీటుపై తీవ్ర గందరగోళం నెలకొంది. తంబళ్లపల్లె నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా శంకర్ యాదవ్ ను చంద్రబాబు నియమించారంటూ అర్ధరాత్రి పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చి శంకర్ అనుచరులు సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే తంబళ్ళపల్లె అభ్యర్థిగా జయచంద్ర రెడ్డిని ప్రకటించారు చంద్రబాబు. అలాంటి ప్రకటన లేదని కావాలనీ శంకర్ అనుచరులు రెచ్చగొట్టే పనులు చేస్తున్నారంటూ జయచంద్ర రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

There is a lot of confusion on TDP seat in Tamballapalle

జయచంద్ర రెడ్డి…. పెద్దిరెడ్డి కోవర్దు అని అందుకే సీటును శంకర్ ఇచ్చారంటూ గత అనుచరులు హంగమా చేస్తున్నారు. అయితే తంబళ్లపల్లిలో అభ్యర్థి మార్పుపై టిడిపి అధిష్ఠానం క్లారిటీ ఇవ్వలేదు. అటు నిన్న ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు శంకర్ యాదవ్. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‍ను పార్టీ కోసం పనిచేయాలని సూచించారట చంద్రబాబు. టికెట్ల కేటాయింపులో మార్పులు చేర్పులు ఉండవని స్పష్టం చేశారు చంద్రబాబు. దీంతో తంబళ్ళ పల్లె TDP సీటుపై తీవ్ర గందరగోళం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news