ఓటుకు నోటు కేసులో కాంప్రమైజ్ అయ్యేది లేదు : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

-

ఓటుకు నోటు కేసులో కాంప్రమైజ్ అయ్యేది లేదు..సుప్రీంకోర్టులో ఈ కేసు పై పోరాడుతానని తెలిపారు. సారవంతమైన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవడం దుర్మార్గం అన్నారు. ఓటుకు నోటు కేసు సిబిఐ దర్యాప్తు చేయాలి అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడంలో వైసీపీ లోపాలను ఎండగడతాం. ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలో మాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అనేక మంది పనిచేస్తూనే ఉన్నారు.

నేను పార్టీలో కొత్తగా చేరుతున్నా..సీనియర్లు నా ముందు వరుసలో ఉండాలని నేను కోరుకుంటా. రాజకీయం వేరు కుటుంబ బంధాలు వేరు.రాజకీయంలో నా వ్యక్తిగత నిర్ణయం నాది ,అలాగని కుటుంబ బంధాన్ని పోగొట్టు కోను. రేపు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. స్వతంత్ర ఉద్యమానికి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది. సంస్థా గతంగా బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది. 175 అసెంబ్లీ స్థానాలు 25 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఈరోజు కేవలం వివాహ ఆహ్వానం ఇవ్వడానికి మాత్రమే షర్మిల వస్తున్నారు. అవసరమైతే షర్మిల తో నేను కూడా సీఎం జగన్ ఇంటికి వెళ్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news