పార్టీ మారే ఆలోచనే లేదు.. మాగంటి సంచలన వ్యాఖ్యలు..!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార వైసీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ-బీజేజీ-జనసేన కూటమి కూడా కొంత మంది అభ్యర్థులను ప్రకటించారు. మరికొంతమందిని త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే టికెట్ దక్కని వారు కొంత మంది ప్రతిపక్ష కూటమిలో జాయిన్ అయితే.. మరొకొందరూ అధికార పక్షంలో జాయిన్ అవుతున్నారు. ఇలా వారికి అనుకూలంగా ఉన్న పార్టీలో వారు జాయిన్ అవుతున్నారు.

గత 24 గంటల నుంచి టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై మాగంటి బాబు స్పందించారు.
గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని ఆయన పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరారు. తాను వ్యక్తిగత పనులపై హైదరాబాద్ లో ఉండటం కారణంగా క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో లేనన్నారు. అలానే టీడీపీని విడిచిపెట్టే ఆలోచన తనకు ‘లేదు’ అని మాగంటి బాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news