నన్ను చంపాలని చూస్తున్నారు – వైసీపీ ఎమ్మెల్యే

-

పల్నాడు జిల్లా వినుకొండలో టిడిపి – వైసిపి నేతల మధ్య జరిగిన ఘర్షణపై స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శుక్రవారం స్పందించారు. తనను అంతం చేయాలని టిడిపి చూస్తుందని ఆరోపించారు. తనపై దాడిలో 400 మంది వరకు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు. తనను చంపి వినుకొండలో విజయం సాధించాలని టిడిపి ప్రయత్నిస్తుందని బ్రహ్మనాయుడు ఆరోపించారు.

అధికారం కోసమే టిడిపి అల్లర్లు సృష్టిస్తోందని.. తనని అడ్డు తొలగించుకుంటే వినుకొండలో సులభంగా విజయం సాధించవచ్చు అని టిడిపి ప్రణాళిక రచిస్తోందని ఆరోపించారు. టిడిపి దాడిలో తన గన్మెన్ కు గాయాలయ్యాయి అని తెలిపారు. అయితే గురువారం టిడిపి చేస్తున్న ర్యాలీని వైసిపి వర్గీయులు అడ్డుకున్నారని టిడిపి శ్రేణులు చెబుతున్నారు. ఈ క్రమంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఈ ఘర్షణను నివారించేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

Read more RELATED
Recommended to you

Latest news