ఏపీకి అరుదైన గౌరవం… విద్యా శకటానికి థర్డ్ ప్రైజ్

-

ఏపీకి అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ వేడుకల పరేడ్ లో ప్రదర్శించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ శకటానికి థర్డ్ ప్రైజ్ వచ్చింది. పీపుల్స్ ఛాయిస్ విభాగంలో డిజిటల్ క్లాస్ రూమ్ థీమ్ తో రూపొందించిన ఈ శకటం అందరినీ ఆకట్టుకుందని ప్రభుత్వం వెల్లడించింది.

Third prize at national level for AP Shakat

మొత్తం 28 రాష్ట్రాల శకటాలు పరేడ్ లో పాల్గొనగా…. గుజరాత్, యూపీ రాష్ట్రాలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు వచ్చాయి. ఇక దీనిపై వైసీపీ పార్టీ స్పందించింది. ఏపి విద్యా సంస్కరణల కిరణాల వెలుగులు మరోమారు దేశవ్యాప్తంగా ప్రసరించాయని తెలిసింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి సమక్షంలో జరిగిన శకటాల ప్రదర్శనల్లో పాల్గొన్న ఏపి శకటానికి జాతీయ స్థాయిలో తృతీయ బహుమతి లభించిందని వివరించింది. విద్యారంగంలో సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఆంధ్ర శకటం ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నది. దీంతో జాతీయ గుర్తింపు దక్కిందని తెలిసింది వైసీపీ పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news