BREAKING: కర్నూలులో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు వెలుగు చూశాయి. కర్నూలు(మ) గార్గేయపురం చెరువులో గుర్తు తెలియని ముగ్గురు మహిళల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. ముందుగా ఒకే ప్రాంతంలో రెండు మృత దేహాలు గుర్తించారు పోలీసులు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/05/Three-bodies-of-women-in-pond.webp)
వెలికి తరలిస్తుండగా చెరువుకు అవతలి ఒడ్డున మరో మహిళ గుర్తించారు. మహిళలపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారా…ప్రమాదవశాత్తు పడిపోయారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.