సీఎం జగన్ పోలవరం పర్యటనకు ముహూర్తం ఫిక్స్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు సీఎం జగన్. ఉదయం 10:15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు ముఖ్యమంత్రి. ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతి నుండి పోలవరం వద్దకు చేరుకుంటారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు పోలవరం ప్రాజెక్టు వద్ద హెలిపాడ్ ను ఏర్పాటు చేశారు.

ఈ పర్యటనలో పోలవరం ప్రాజెక్టు లోయర్, అప్పర్ కాపర్ డ్యామ్ లను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులు, ఇంజనీర్లతో సీఎం జగన్ సమావేశం అవుతారు. వేగంగా పనులు చేపట్టేలా అధికారులకు దిశా నిర్దేశం చేయరున్నారు సీఎం జగన్. అయితే సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో శనివారం పోలవరం ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సందర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news