తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ జనవరి నెల దర్శన టిక్కెట్లు విడుదల

-

తిరుమల భక్తులకు శుభవార్త.. తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో జనవరి నెలకు సంభందించిన ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం 10 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి.

Tirumala special darshan tickets for the month of January have been released online today

ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అంగప్రదక్షణ టోకేన్లు విడుదల అవుతాయి. రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇది ఇలా ఉండగా.. నేరుగా తిరుమల శ్రీవారి దర్శనం జరుగుతోంది. తిరుమలలోని కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారీ దర్శనం జరుగుతోంది. 64359 మంది భక్తులు..నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 20711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు హుండి ఆదాయం 3.59 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news