నేడు సీఎం జ‌గ‌న్ విశాఖ ప‌ర్య‌ట‌న‌.. హ‌ర్యాన సీఎంతో భేటీ

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నేడు విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. విశాఖ జిల్లా లోని ప్ర‌కృతి వైద్యం తీసుకుంటున్న హ‌ర్యానా రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం కానున్నారు. ఈ భేటీ కోసం, సుమారు రెండు గంటల పర్యటన కోసం ఈ రోజు సీఎం వైఎస్ జ‌గ‌న్ విశాఖ‌కు రానున్నారు. ఈ రోజు ఉద‌యం 11 : 10 నిముషాలకు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు.

ముంద‌గా విశాఖ జిల్లా వైసీపీ నేత‌ల‌తో ఏపీ సీఎం జ‌గ‌న్ 12 : 10 గంటల వ‌ర‌కు స‌మావేశం అవుతారు. గంట పాటు పార్టీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యాక.. ఋషికొండలోని పెమా వెల్ నెస్ సెంటర్ ఉన్న హ‌ర్యానా రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్ల‌నున్నారు. మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ తో దాదాపు గంట పాటు స‌మావేశం కానున్నారు. అనంత‌రం సీఎం వైఎస్ జ‌గ‌న్ 1 : 20 గంట‌ల‌కు తిరుగు ప్ర‌యాణం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news