CM JAGAN: నేడు సీఎం జగన్ ప్రచార సభ కు విరామం

-

సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పార్టీ అంతర్గత సమావేశాల నేపథ్యంలో ఇవాళ ప్రచారానికి వెళ్లడం లేదు సీఎం జగన్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని చేసేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

CM Jagan will participate in election campaign meetings in three constituencies today

అయితే ఇవాళ ఎన్నికలకు 11 రోజుల సమయం కూడా లేకపోవడంతో… గెలిచే స్థానాలపై ఎక్కువగా ఫోకస్ చేసేలా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు సీఎం జగన్. గెలిచే చోట కచ్చితంగా ఫోకస్ పెట్టాలని… వాటిని కైవసం చేసుకునేలా వ్యూహరచనలు చేయాలని ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇవాళ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అటు పులివెందులలో సీఎం జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన సతీమణి భారతి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news