నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ లకు సెలవు

-

తూర్పుగోదావరి జిల్లా జిల్లా రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు కీలక ప్రకటన చేసింది. ఇవాళ విజయదశమి పండుగ సందర్భంగా రాజమండ్రీ సెంట్రల్ జైల్లో మూలాకత్ కు సెలవు ప్రకటించింది. ఈరోజు సెలవుకు సంబంధించి నోటీసులను జైలు అధికారులు జారీ చేశారు. ఈ విషయాన్ని గ్రహించి ఖైదీలు రెమాండ్ ఖైదీలు కుటుంబ సభ్యులు సహకరించాలని జైల్లో అధికారులను కోరారు. అయితే మరోవైపు స్కిల్ స్కాం కేసులో టిడిపి అధినేత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఇవాల్టికి 46వ రోజుకు చేరుకుంది. స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో చంద్రబాబు గత నెల 9న అరెస్టు అయ్యారు. నవంబర్ ఒకటో తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు గడువును పొడగించింది.

చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు హెల్త్ బులిటను విడుదల చేశారు. తీసుకుంటుండగా నిమిషానికి 62 సార్లు గుండె కొట్టుకుంటున్నట్లు హెల్త్ బులిటన్లో పేర్కొన్నారు. ఊపిరితిత్తులకు ఎలాంటి సమస్య లేదని చంద్రబాబు చాలా ఆక్టివ్ గానే ఉన్నారని డాక్టర్ల టీం జైలు అధికారులకు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news