నేడు 3వ రోజు వైసీపీ బస్సు యాత్ర.. ఈ ప్రాంతాల్లోనే

-

నేడు 3వ రోజు వైసీపీ బస్సు యాత్ర కొనసాగనుంది. సామాజిక సాధికార యాత్ర డే 3లో భాగంగా ఇవాళ ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైసీపీ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇందులో మంత్రులు బొత్స, సిదిరి అప్పలరాజు, కార్మూరి, మేరుగ, విడదల, రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతలు పాల్గొననున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12:30 కు బస్సు యాత్ర ప్రారంభంకానుంది.

YSRCP Samajika Sadhikara Yatra
YSRCP Samajika Sadhikara Yatra

అనంతరం విశాఖపట్నం జిల్లా పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం జరుగనుంది.
అలాగే.. కోస్తా రీజన్…బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో ఈ బస్సులో జరుగనుంది. ఇందులో మంత్రి జోగి రమేష్, పార్థసారథి, ఇతర ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొననున్నారు. రాయలసీమ రీజన్ లో అంటే…కడప జిల్లా ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం ఈ బస్సు యాత్ర జరుగుతుంది. ఇందులో డిప్యూటీ సీఎం అంజాద్ భాష, అనిల్ కుమార్ యాదవ్, బుట్టా రేణుక, ఆకేపాటి అమర్నాథ్ ఇతర నేతలు పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు వైవిఆర్ ఫంక్షన్ హాల్ లో స్థానికులతో సమావేశం జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news