రేపే బీజేపీ ఆవిర్భావ దినోత్సవం… అధిష్టానం కీలక నిర్ణయం

-

అమరావతి : రేపు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో జరిగే కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పాల్గొనున్నారు. ప్రతి మండలం,జిల్లా కేంద్రం లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపాలని ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆదేశాలు జారీ చేశారు.

ఇక రేపు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శోభాయాత్ర ఉండనుండగా .. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడి స్పీచ్ ఇవ్వనున్నారు. మండల, గ్రామ స్థాయి లో ఎక్కడికక్కడ మోడీ స్పీచ్ నీ టోపీలు పెట్టుకునీ వీక్షించేలా ఏర్పాట్లు చేసింది బీజేపీ అధిష్టానం. సామాజిక న్యాయం కార్యక్రమాలు ఏప్రిల్ 7 నుండి 20 తేదివరకు చేయతలపెట్టనుంది బిజెపి పార్టీ కేంద్ర నాయకత్వం. కాగా భారతీయ జనతా పార్టీ 1980 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన స్థాపించబడింది. భారతీయ జనతా పార్టీని అటల్ బీహార్ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ స్థాపించారు.

Read more RELATED
Recommended to you

Latest news