టిడిపి ప్రభుత్వంలో రూ.400 కోట్ల అవినీతి.. మొత్తం ఆధారాలు ఉన్నాయి : ఏపీ మంత్రి

-

బాబు జగజ్జివన్ రామ్ జయంతి కార్యక్రమంలో పినిపే విశ్వరూప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14 నాటికి స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహాన్ని పూర్తి చేసి సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. విదేశీ విద్య పై గత ప్రభుత్వ హయాంలో అవినీతి పై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నామని.. టిడిపి హయాంలో రూ.400 కోట్లు అవినీతి జరిగినట్టు తేలిందని ఆరోపనలు చేశారు.

400 మంది కాపు విద్యార్థులు కు వీసా రిజెక్ట్ అయితే వారు వెళ్లినట్టు చూపించారని.. 300 మంది విద్యార్థుల వివరాలు ఇప్పటికి ట్రేస్ అవ్వడం లేదని మండిపడ్డారు. ఇందులోనూ అవినీతి జరిగిందని అనుమానిస్తున్నామన్నారు.

బాబు జగజ్జివన్ రామ్, బాబా సాహెబ్ అంబేడ్కర్ ల చరిత్ర పిల్లల పుస్తకాల్లో పాఠాలుగా చేర్చాలని ముఖ్యమంత్రిని కొరతానని.. ఎన్నో కష్టాలు పడి బాబు జగజ్జివన్ రామ్ పోరాటం చేశారని చెప్పారు. బ్రతుకు కోసం, చదువు కోసం ఆయన చిన్నతనం నుండి పోరాటం చేశారు.. రెండు కుండల విధానంను పాఠశాల లో వుండగానే పోరాటం చేశారని చెప్పారు. ప్రిన్సిపాల్ ను ఎదిరించి ఒక కుండ ఏర్పాటు చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news