శ్రీవారి భక్తులకు అలెర్ట్..నేడు ఏప్రిల్ కోటా ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. నేడు ఏప్రిల్ కోటా ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ మాసం కు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవాళ ఉదయం 11 గంటలకు సమయంలో తమ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు టిటిడి పాలకమండలి అధికారిక ప్రకటన చేసింది.

 

ఈ మేరకు భక్తులు ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచనలు చేసింది టీటీడీ పాలకమండలి. ఈ ప్రత్యేక దర్శన టికెట్ ధర 300 రూపాయలు ఉంటుందని పేర్కొంది. ముందు జాగ్రత్తగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటే శ్రీవారి దర్శనం అవలీలగా జరుగుతుందని పేర్కొంది టీటీడీ పాలక మండలి. కాగా తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 79,415 మంది భక్తులు.. కాగా తలనీలాలు సమర్పించిన 28,454 మంది భక్తులుగా ఉన్నారు. హుండీ ఆదాయం రూ. 3.86 కోట్లు గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news