రెండోసారి శ్రీవారికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టమే – టిటిడి ఛైర్మన్‌ భూమన

-

రెండోసారి శ్రీవారికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టమేనని కొత్త టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సామాన్య ప్రజలకు పెద్దపీట వేస్తామని.. గతంలో ఏవిధంగా పనిచేసామో అంతకు మించిన విధంగా సామాన్య భక్తుల కోసం పనిచేస్తామని వివరించారు. రెండోసారి వేంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టం గా భావిస్తున్నానని….వేంకటేశ్వర స్వామీ కృప, అధినేత జగన్ ఆశిస్సులతో అవకాశం లభించిందని తెలిపారు.

వైసీపీ పార్టీ అధినేత జగన్ ఇచ్చిన అవకాశాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మంచి పేరు తీసుకొని వస్తాను..హిందు ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తు గతంలోలాగా తీసుకుని వెళ్ళడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని వెల్లడించారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని టిడిపి చైర్మన్ పదవి రాదని.. అలాంటి అవకాశం 15 సంవత్సరాల తరువాత మళ్ళీ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి హాయంలో చైర్మన్ గా పనిచేశాను…ఇప్పుడు తనయుడు హాయంలో చైర్మన్ పనిచేయడం అదృష్టం గా భావిస్తున్న… ఇది కూడా వెంకన్న ఆశిస్సులతో లభించిందని భావిస్తున్నానని… తండ్రి దగ్గర, కొడుకు దగ్గర పనిచేసే అవకాశం ఇంకా ఎవరికి రాకపోవచ్చు అని తెలిపారు టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news