ఇలాంటి ఛాన్సు రాదు… ఏపీకి రావాల్సిన నిధులు తీసుకురండి – ఉండవల్లి అరుణ్ కుమార్

-

ఇప్పటికైనా ఏపీకి రావాల్సిన నిధులు తీసుకురండి అంటూ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అభినందనలు చెప్పారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు ఉండవల్లి.

undavalli arun kumar about chandrababu

ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని… ఆంధ్రప్రదేశ్ ఫలితాలు తోటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వివరించారు. బిజెపి పొత్తు లేకపోయినా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేకపోవును… కూటమి పొత్తు లేకపోతే ప్రధాని మోడీకి నష్టం అన్నారు. ఇప్పటికైనా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రావలసిన వి రాబట్టాలని…. మీరు ఏమి చెప్పితే అదే జరుగుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, రైల్వే జోన్ ఏర్పాటు సాధించాలని డిమాండ్‌ చేశారు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news