నంద్యాలలో మైనర్ బాలిక పై అత్యాచార యత్నం..!

-

నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలిక పై అత్యాచార యత్నం చేసారు ఓ కామాంధుడు. అయితే నంద్యాల లోని అవుకు మండలం కాశీపురం లో ఈ దారుణం జరిగింది. మైనర్ బాలిక పై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు 38 ఏళ్ళ దస్సయ్య అనే కామాంధుడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మైనర్ బాలిక పై అత్యాచారానికి యత్నం చేసాడు.

అయితే బాలిక కేకలు వేయడంతో పక్కింటి వాళ్ళు ఇంట్లోకి వచ్చి వచ్చి కామాంధుడిని పట్టుకున్నారు. ఈ ఘటనకు ఒడి గట్టిన కామాంధుడి ని గ్రామంలోని వీధుల వెంట త్రిప్పి దేహశుద్ధి చేసారు గ్రామస్తులు అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితున్ని వారికి అప్పజెప్పారు. దాంతో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు దస్సయ్య. అయితే ఆ మైనర్ బాలిక కోవెలకుంట్ల లోని శ్రీనివాస్ హై స్కూల్ లో 8వ తరగతి చదువుతుంది. అదే స్కూల్ కు చెందిన వ్యాన్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు ఈ నిందితుడు దస్సయ్య.

Read more RELATED
Recommended to you

Latest news