Expire అయిన పచ్చళ్లు అమ్మిన నీచుడు – రామోజీపై సాయిరెడ్డి సీరియస్

-

Expire అయిన పచ్చళ్లు అమ్మిన నీచుడని రామోజీ రావుపై వైసీపీ ఎంపీ సాయిరెడ్డి సీరియస్ అయ్యారు. నువ్వు మామూలోడివి కావు డ్రామోజీ! ప్రసాదం అని నమ్మించి పచ్చి విషాన్ని మార్కెట్ చేయగల మోసగాడివంటూ చురకలు అంటించారు.

Expire అయిన పది టన్నుల ప్రియమైన పచ్చళ్ళ ప్యాకెట్లకు కొత్త లేబుల్స్ అంటించి డిస్కౌంట్ పేరుతో పేపర్ ఏజెంట్ల ద్వారా అమ్మావట! అప్పటి ప్యాకింగ్ సెక్షన్ ఉద్యోగులు ఇప్పటికీ చెప్పుకుంటారని ఆగ్రహించారు విజయసాయిరెడ్డి.

ఇక మరో ట్వీట్‌ లో.. చక్రవర్తులు అనుకున్న మహా మహులెవరూ జీవితకాలం పాలించలేదు. హిట్లర్ కూడా నీలాగే కలలు కన్నాడు చంద్రం అన్నయ్యా. అధికారంలో ఉన్నన్ననాళ్లు అహంతో అందరినీ వేధించావు. కాళ్ళు పట్టుకుని, కుట్రలు చేసి జైళ్లకు పంపావు. నీ పుస్తకంలోని ప్రతి అక్షరం ప్రజలకు కంఠస్తమే. ఆశలేం పెట్టుకోకని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news