మూడు రోజులు దుర్గగుడి ఘాట్ రోడ్డు బంద్..!

-

విజయవాడ దుర్గగుడి పై భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. అయితే ఆ కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ. అనంతరం ఈ ఘటన పై సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎడతెరపి లేకుండా పడుతున్న వర్షాలతో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కొండ చరియలు విరిగి ప్రోటోకాల్ ఆఫీస్ పై పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఆస్తి నష్టం జరగలేదు.

అయితే ఈ వర్షం పడడం వల్ల ప్రస్తుతం ఘాట్ రోడ్డు మూసి వేయడం జరిగింది. ఇక రానున్న మూడు రోజులు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఘాట్ రోడ్డు మూసివేయ బడుతుంది అని తెలిపారు. భక్తుల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మెట్ల మార్గాన్ని, లిప్ట్ మార్గాన్ని మాత్రమే భక్తులు వినియోగించు కోవాలి. దీని కోసం భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక భక్తుల శ్రేయస్సు కోసం అన్ని రకాల చర్యలు చేపడతాం అని కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news