అవినాష్‌ను టార్గెట్ చేసి వేధిస్తున్నారు – YS రాజశేఖర్ రెడ్డి చెల్లెలు

-

వైఎస్‌ వివేకా కేసుపై YS రాజశేఖర్ రెడ్డి చెల్లెలు విమలా రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్యపై సంచలన కామెంట్లు చేసిన ఆయన సోదరి విమలారెడ్డి.. వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారని ఆగ్రహించారు. తప్పు చేయని వారిని జైల్లో పెట్టారన్నారు.

అవినాష్‌ను టార్గెట్ చేసి వేధిస్తున్నారని నిప్పులు చెరిగారు. తన కుటుంబం ఎవరినీ హత్య చేయలేదని సునీత మొదట చెప్పారని తెలిపారు విమలా రెడ్డి. ఆ తర్వాత సునీత మాట మార్చారు, తప్పు అని చెప్పినందుకే సునీత మాతో మాట్లాడటం లేదు, ఆలస్యమైనా న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు విమలారెడ్డి. అవినాష్‌కు ధైర్యం చెప్పడానికి వచ్చానన్నారు విమలారెడ్డి.

https://www.youtube.com/live/ZUlA-ujwbhI?feature=share

Read more RELATED
Recommended to you

Latest news