వినుకొండ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ !

-

వినుకొండ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వినుకొండ రషీద్ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. నర్సారావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసలు నిజాలు చెప్పేశారు. గంజాయి మత్తులో ఎవరినో చంపబోయి రషీద్‌ని జిలానీ పొట్టన బెట్టుకున్నాడని గోపిరెడ్డి తేల్చి చెప్పారు.

పాత గొడవలున్న వేరే వ్యక్తిని మర్డర్ చేయడానికి వచ్చిన జిలానీ గంజాయి మత్తులో రషీద్ ని చంపాడని తెలిపారు. జగన్ చెప్పినట్టు ఇది పొలిటికల్ మర్డర్ కాదని తేల్చేశారు. కాగా, వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన ఆయన.. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ అరాచక పాలన రాజ్యమేలుతోందని ఆరోపించారు. హత్యలు, అరాచకాలు పెచ్చుమీరాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆటవిక పాలన కొనసాగుతోందని.. మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news