విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదం.. టీడీపీ ఆర్థిక సాయం

-

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనలో బాధిత మత్స్యకార కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఆర్థికసాయం ప్రకటించింది. బోట్లు కోల్పోయిన వారికి రూ. లక్ష పాక్షికంగా దెబ్బతింటే రూ. 50,000, కళాసీలకు రూ. 5000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక బాధితులకు కొత్తబోట్లు అందిస్తామని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా… విశాఖలో బాధిత మత్స్యకారులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని జనసేన అధిపతి అందజేశారు. మత్స్యకారులకు ఆపత్కాలంలో అండగా ఉంటామని ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం విశాఖ చేరుకొని ఫిషింగ్ హార్బర్ లోని ఘటనా స్థలాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news