ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లిన విశాఖపట్నం కార్పొరేటర్లు సురక్షితం

-

ఉత్తర భారత దేశంలోని మునిసిపాలిటీలకు పర్యటనకు వెళ్ళిన విశాఖ కార్పోరేటర్లు అక్కడ కొండ చర్యలు విరిగిపడడంతో చిక్కుకుపోయారు. కులుమనాలి – మొండి మధ్య వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కార్పొరేటర్ల వర్గం మధ్యలో ఇరుక్కుపోయింది. అయితే పర్యటనకు వెళ్లిన విశాఖపట్నం కార్పొరేటర్లు, అధికారులు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్. జీవీఎంసీ కార్పోరేటర్లతో మాట్లాడినట్లు తెలిపారు.

గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో మహిళా కార్పొరేటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలిపారు. స్థానిక డిజిపితో మాట్లాడి తగిన సహాయం అందించాలని కోరినట్లుగా తెలిపారు. ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని పంపి వారికి తగిన సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు ప్రవీణ్ ప్రకాష్. కార్పొరేటర్లను ఢిల్లీకి సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి స్వస్థలాలకు పంపనున్నట్లు తెలిపారు ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషన్ ప్రవీణ్ ప్రకాష్.

Read more RELATED
Recommended to you

Latest news