త్వరలోనే ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం – హరీష్ రావు

-

కొత్తగా ఇళ్లు కట్టుకునే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సిద్దిపేట జిల్లా నంగునూరు (మం) పాలమాకుల గ్రామంలో నిర్మించిన 23 డబుల్ బెడ్ రూమ్ లను పంపిణీ చేశారు మంత్రి మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. త్వరలోనే ఇంటి అడుగుజాగలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటన చేశారు.

మోడీ ప్రభుత్వం ఉచితాలు వద్దని చెప్పి 10 లక్షల కోట్ల రూపాయలను పారిశ్రామిక వేత్తలకు రుణాలు మాఫీ చేసిందని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉచితాలపై ఎద్దేవా చేయడం సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దొంగ రాత్రి కరెంటు వచ్చేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆదాయం పెంచింది సీఎం కేసీఆర్ అయితే ప్రజల సొమ్మును ధనవంతులకు పంచింది బీజేపీ అని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం లో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయని స్పష్టం చేశారు మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news