CM Jagan: ఎన్నికల తర్వాత రాజధాని వైజాగే…ఇక్కడే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తా

-

CM Jagan: ఎన్నికల తర్వాత రాజధాని వైజాగే…ఇక్కడే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానంటూ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. విశాఖ జిసిఎంసీ పరిధిలో 1500కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్‌….అనంతరం మాట్లాడారు.

CM YS Jagan will visit Visakhapatnam today

వచ్చే ఎన్నికల అనంతరం వైజాగ్ నుంచి పాలన సాగిస్తానని… మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని వెల్లడించారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానని చెప్పారు సీఎం జగన్. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే విశాఖ అభివృద్ధి చెందదన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ….ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వెల్లడించారు.

విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందని స్పష్టం చేశారు సీఎం జగన్. కోర్టు కేసులతో సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి…స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది విశాఖపై విషం కక్కుతున్నారని ఫైర్‌ అయ్యారు. భవిష్యత్ తరాల కోసమే మేం పనిచేస్తున్నామన్నారు సీఎం జగన్‌.

 

 

Read more RELATED
Recommended to you

Latest news