ఢిల్లీ ఆర్ధిక శాఖ మంత్రిగా బుగ్గన మారాడు – విష్ణు వర్దన్ రెడ్డి

-

ఢిల్లీ ఆర్ధిక శాఖ మంత్రిగా బుగ్గన మారాడని ఎద్దేవా చేశారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్దన్ రెడ్డి. అభివృద్ధి పైనా వైసిపి చర్చకు రావడానికి భయం..ఏపీలో అభివృద్ధి శూన్యం అన్నారు. ఏపీలో ఎంతమంది కొత్త వైద్యులు వచ్చారు,ఎన్ని హాస్పటల్స్ కట్టారని.. ఢిల్లీ ఆర్ధిక శాఖ మంత్రిగా బుగ్గన మారాడని ఎద్దేవా చేశారు. అప్పు చేయకుండా ఏ రోజు జగన్ ప్రభుత్వం లేదు.

ఏపీలో ఉండేది పేరుకే మంత్రులు…ఉన్నారు అంటే ఉన్నారు.. తిట్టడానికి బయటకు వస్తారని ఫైర్‌ అయ్యారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్దన్ రెడ్డి. దేశంలో ఎక్కడ పెరగని ధరలు ఏపీలో పెరుగుతుంటాయి..ఏపీలో ఎక్సైజ్ శాఖ మాత్రమే బాగానే పనిచేస్తోందని చురకలు అంటించారు.
మద్యం శాఖ మంత్రికి ప్రపంచ స్ధాయిలో అవార్డు ఇవ్వాలి..రిజిస్టేషన్ ఆపేసి మరి కొత్త జీవో తెచ్చి ఆదాయం పెంచుకోవడానికి చార్జీలు పెంచుతున్నారని నిప్పులు చెరిగారు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్దన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news