వివేకా హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌..తెరపైకి బీటెక్‌ రవి పేరు.. తులసమ్మ సంచలన వాంగ్మూలం

-

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న దేవి రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల కోర్టులో హాజరయ్యారు.

మెజిస్ట్రేట్ ముందు అనే వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసులో ఇంకా ఆరుగురుని విచారించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. వైఎస్ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బీటెక్ రవి, వివేకా బావమరిది శివప్రకాశ్ రెడ్డి, నీరు గుట్టు ప్రసాద్, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డిలను కూడా ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. తులసమ్మ గత ఫిబ్రవరిలో పిటిషన్ దాఖలు చేయగా, ఇన్నాళ్లకు ఆమె వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news