అన్నయ్యా ..అన్నయ్యా అంటునే ఆ నేత దూల తీర్చేస్తున్నారా…?

-

అన్నయ్య అన్నయ్యా అంటూ సీనయర్ నేతకు శఠగోపం పెట్టేస్తున్నారట తమ్ముల్లు .. తాము చేస్తున్న ప్రతీ పనికి ఆ అన్నయ్య నేమ్ బోర్డుని తగిలించేస్తున్నారట .. అధికారంలోకి వచ్చేందుకు తనతోపాటు తోడుగా ఉన్నారని పక్కన పెట్టుకుంటే ఆ అన్నయ్యకే పక్కలో బల్లేంలో తయారయ్యారట ఆక్కడ తమ్ముల్లు.

ఏపీలోనే రాజకీయంగా పేరోందిన నియోజకవర్గం విజయనగరం .. రాజకీయంగా కూడా ఏంతో చైతన్యంగా ఉంటుంది . 2019 ఏన్నికల్లో సైతం విజయనగరం జిల్లా వాసులు వైసిపి కి బ్రహ్మరథం పట్టారు. జిల్లా కేంద్రం అయిన విజయనగరం నియోజకవర్గంలో సైతం పూసపాటి రాజ వంశ వారసరాలు అధితి గజపతి రాజు పై వైసిపి సీనియర్ నేత కోలగట్ల వీరభద్ర స్వామి విజయం సాధించారు

విజయనగరం పట్టణంలో కోలగట్ల వీరభద్ర స్వామి కంటే స్వామి అన్నయ్యగానే నగర వాసలకు చీరకాలంగా పరిచయం . ఇండిపెండెంట్ గా భరిలో దిగి ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన పూసపాటి అశోక్ గజపతిరాజుని ఓడించి సంచలనం సృష్టించారు ఆయన .. అలాంటి స్వామి అన్నయ్యకు నియోజకవర్గంలో ఆయన తమ్ముళ్లు అదే నండి ఆయన అనుచరులు చెడ్డపేరు తెస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. వీరభద్ర స్వామి గెలిచిన నాటి నుండి నగరవాసులందరికి నిత్యం అందుబాటులో ఉంటానని ఎవరికి ఏ సహాయంకావాలన్నా తాను చేస్తానంటూ ప్రకటనలిస్తు వస్తుంటే .. స్వామి అనుచరులు మాత్రం నగరంలో హాల్ చల్ చేస్తున్నారట.

స్వామి అన్నయ్య మనుషులం అంటూ ఓక్కో ప్రభుత్వ కార్యాలయాన్ని ఓక్కో చోటా నేత తనకనుసన్నలో నడిపిస్తున్నారట . ఇక ఎమ్మేల్యే స్వామి పేరు చేప్పి అనేక మంది తమ్ముల్లు సివిల్ , ల్యాండ్ వివాదాల్లో సైతం తలదూరుస్తున్నారని సమాచారం . ఇక ప్రజలందరికి స్థానికంగానే సేవలందించడానికి సీఎం జగన్ తీసుకోచ్చిన సచివాలయ వ్యవస్థని సైతం ఎమ్మేల్యే అనుచరులు తమ సోంత కార్యాలయాలుగా వాడుకుంటున్నారని నగరంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎవరైనా ఎదురు ప్రశ్నించినా .. తాము స్వామి అన్నయ్య తమ్ముళ్లమంటూ దభాయిస్తున్నారట. ఎమ్మెల్యే మాత్రం తాను పక్కా ఫెయిర్ అంటూ జనంలోకి వెళ్తుంటే తమ్ముళ్లేమో అన్నయ్య పేరు దూల తీరుస్తున్నారంట…

Read more RELATED
Recommended to you

Latest news