పవన్ కళ్యాణ్ కి ఓయూ విద్యార్థుల వార్నింగ్..!

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. నిన్న హైదరాబాద్ లోని ఎల్బీస్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రధాని మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచ్చేసారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీసీ సభలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియమాకాల కోసం జరిగిందని.. కానీ అవి అమలు జరిగాయా అని ప్రశ్నించారు.

దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఓయూ విద్యార్థులు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓ బ్రోకర్ అని.. పవన్ కళ్యాణ్ ఓ ఐటమ్ సాంగ్ చేసే వ్యక్తి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పవన్ ఏనాడు పోరాడలేదు. ఏనాడు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు ఓయూ విద్యార్థులు. పవన్ ను తరిమికొడతామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news