ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం మాకు లేదు : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

-

పల్నాడు జిల్లాలో పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాత్రి వారిద్దరూ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తిరిగి రాలేదు పిన్నెల్లి సోదరులు. పిన్నెలి రామకృష్ణా రెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామి రెడ్డి.. ఇరువురు కూడా రాత్రి గన్ మెన్లతో సహా ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వారిద్దరూ ఇప్పటివరకు రాలేదు అంటే.. అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వినిపించాయి. గన్ మెన్లను కూడా వారు వెంట తీసుకెళ్లినట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

మరోవైపు పోలింగ్ రోజు నుంచే మాచర్లలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ కనిపించకపోవడం అనే వార్త సెన్షేషన్ అవుతున్న తరుణంలోనే తాజాగా వారు స్పందించారు. తన సోదరుడితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వచ్చిన వార్తలను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఖండించారు. వ్యక్తి గత పనుల కోసం హైదరాబాద్ లో ఉన్నట్టు తెలిపారు. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమపై ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news