దసరాకు అసలు సినిమా చూపిస్తాం – ధూళిపాళ్ల నరేంద్ర

-

అమరావతి: స్పీకర్ తమ్మినేని సీతారాంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర. స్పీకర్ తమ్మినేని పదవికి కళంకం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు,స్పీకర్ ఒక రోజు సెక్యూరిటీ లేకుండా తిరగ్గలరా..? అని ప్రశ్నించారు. డిగ్రీ తప్పిన స్పీకర్ ఎల్ఎల్బీ ఎలా చదివారు..? అని నిలదీశారు ధూళిపాళ్ల. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తే వైసీపీలో అలజడి మొదలైందన్నారు. మొన్నటి మేనిఫెస్టో చిన్న టీజర్ మాత్రమేనని.. అసలు సినిమా దసరాకు ఉందన్నారు.

టీడీపీ మేనిఫెస్టోకి పిచ్చెక్కి 15 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేశారని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న వైసీపీ.. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీని చూసి ఎందుకు వణుకుతోందని ఎద్దేవా చేశారు. అంబటి రాంబాబు అసమర్ధ ఇరిగేషన్ మంత్రి అని విమర్శించారు ధూళిపాళ్ల. కొడాలి నాని అసమర్థుడు కాబట్టి.. జగన్ మంత్రి పదవి ఊడగొట్టారని అన్నారు. కేబినెట్ నుంచి తరిమికొడితే నాని బయటకి వచ్చి పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడన్నారు. దసరాకు అసలు సినిమా చూపిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news