చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలి ? : సీఎం జగన్

-

చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. రాప్తాడు వైసీపీ సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. పక్క రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసే వాళ్ళు అవసరమా మనకు..? చంద్రబాబు పేరు చెప్పితే ఒక్క పథకమైన గుర్తుకొస్తుందా. చంద్రబాబు 14 ఏళ్ల పాలన లో రైతులకు గుర్తుకు వచ్చే పథకం ఒకటైన ఉందా అని ప్రశ్నించారు.

ప్రజలు చొక్కా మడతేసి చంద్రబాబుకు ఉన్న కుర్చీలను మడిచి 2019లో 23 సీట్లకు పరిమితం చేశారని సీఎం జగన్ వ్యాక్యానించారు. మళ్లీ టీడీపీని ఓడించేందుకు చొక్కాలు మడత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా..? రంగు రంగుల మేనిఫెస్టోతో చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారు. ఆయన వాగ్దానాలను నమ్మొద్దు. పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించుకోవాలని సూచించారు కార్యకర్తలు, వాలంటీర్లు ఈ విషయాలను తప్పకుండా ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news