వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి పోటీ చేస్తా – యార్లగడ్డ

-

సోమవారం వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు తో యార్లగడ్డ వెంకటరావు భేటీ అయ్యారు. కోర్టు వాయిదాకు వెళుతూ హనుమాన్ జంక్షన్ లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలలో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. గత ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత తను అమెరికా వెళ్ళిపోతానని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి రాజకీయంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల కార్యకర్తలకు ఏం చేయలేకపోయానని పేర్కొన్నారు.

అయితే 2019 ఎన్నికలలో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు యార్లగడ్డ వెంకట్రావు. అక్కడి నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ విజయం సాధించి ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి మద్దతుగా ఉన్నారు. అయితే ఈసారి గన్నవరం టికెట్ వంశీకే ఇస్తారన్న ప్రచారం సాగుతున్న నేపద్యంలో యార్లగడ్డ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news