VOLUNTEER SYSTEM: పవన్ కేసుపై విచారణ వాయిదా … !

-

కొన్ని రోజుల క్రితం ఉద్దేశ్యం ఏదైనప్పటికీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపాయి అని చెప్పాలి. ఈ వ్యాఖ్యల పైన ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించబోతున్నది.. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ పైన ఒక వాలంటీర్ పరువు నష్టం కేసును విజయవాడ సివిల్ కోర్ట్ లో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ లో సదరు వాలంటీర్ పవన్ చేసిన వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయని, నా మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. అందులో భాగంగా షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఆ కేసును విచారణ చేయాల్సి ఉండగా.. సివిల్ కోర్ట్ రేపు విచారణ చేయనున్నాం అంటూ తెలిపింది.

ఇప్పుడు రేపు జరగనున్న విచారణలో ఏమి జరగనుంది ? పవన్ తరపున లాయర్ ఈ కేసుకు ఏ విధంగా సంజాయిషీ ఇవ్వనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news