బ్రిటీష్‌ వాళ్లు పెట్టిన కొన్ని నియమాలనే తిరుపతిలో ఇంకా పాటిస్తున్నారా..?

-

బ్రిటీష్‌ వాళ్ల కాలంలో ఎన్నో రూల్స్‌ పాటింటేవాళ్లు. కానీ స్వతంత్రం వచ్చాక వారి పోయినట్లే.. వాళ్లు పెట్టిన రూల్స్‌ కూడా మెల్లగా మారిపోయాయి. కానీ ఈరోజుకి బ్రిటీష్‌ వాళ్లు పెట్టిన నియమాలే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో పాటిస్తున్నారట. చాలామందికి అసలు ఈ విషయం తెలియదు.. మరి ఇంతకీ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందామా..

 తిరుపతి
తిరుపతి

మన దేశాన్ని 200 సంవత్సరాలకు పైగా పరిపాలించిన బ్రిటిష్ దొరలు వెంకటేశ్వర స్వామి భక్తులుగా మారడమే కాకుండా గుడి అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టారు. టీటీడీ వద్ద ఉన్న పురాతన ఆలయ రికార్డుల ప్రకారం 1801 నుంచి 1843 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణ బాధ్యతలను అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నార్త్ అర్కాట్ నేతృత్వంలో జరిగింది.

అప్పట్లో దేవాలయంలో ఎన్నో అంతర్గత కలహాలు ఉండడంతో బ్రిటిష్ వారు కఠినమైన క్రమశిక్షణ, నియమాలతో పాలనను చేపట్టారు.ఈ మేరకు 1803 జనవరి 31న తొలిసారిగా మద్రాసులోని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి స్టాటన్ దొర తన నివేదికను కూడా సమర్పించారు. ఆయన తర్వాత విచారణ అధికారిగా వచ్చిన పి. బ్రూస్ టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలను నిర్దేశించారు. అవే ఇప్పటికీ పాటిస్తున్నారట.

కైంకర్యపట్టీ

తిరుమల తిరుపతి దేవస్థానంలోని సిబ్బంది, పరిచారికలు, మిరాశీ దారులు, జియ్యర్ సిబ్బంది విధులకు సంబంధించి 1801 మరియు 1820లో రెండు సార్లు ఈ కైంకర్యపట్టీ తయారు చేయడం జరిగింది. దీని ఆధారంగానే సిబ్బంది యొక్క నియామకం, హోదా, విధులు ,జీతభత్యాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికీ ఇదే పాటిస్తున్నారు.

పైమేయిషి ఖాతా

ఆలయానికి సంబంధించిన స్థిరచరాస్తులు, దేవతా విగ్రహాలు, చిత్రాలు, తిరుమల, తిరుపతి ఇతర పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆలయ వివరాలు, ఇనాంగా ఇచ్చిన గ్రామాల యొక్క వివరాలను రికార్డు రూపంలో పొందు పరచడం జరిగింది. 1819లో రూపొందించిన ఈ రికార్డును “పైమేయిషి అకౌంట్” అని పిలుస్తారు.

బ్రూస్ కోడ్

ఈస్ట్ ఇండియా కోడ్ ఆఫ్ డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం.. అప్పట్లో ఆలయ పాలన సక్రమంగా జరగడం కోసం బ్రూస్ కోడ్ అనే ప్రత్యేకమైన కోడ్ రూపొందించడం జరిగింది. నేటికీ ఆలయ పాలన దిక్సూచిగా ఈ బ్రూస్ కోడ్ వాడుతారు.

దిట్టం

శ్రీవారికి సమర్పించేటటువంటి నైవేద్యానికి సంబంధించిన ముడి ఏ పరిమాణంలో తీసుకోవాలి నిర్ణయించేదే దిట్టం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదరూపేనా తయారు చేసే లడ్డూలు దగ్గర నుంచి వాడే పుష్పాల వరకు దీన్ని అనుసరిస్తారు.

సవాల్- ఇ-జవాబు

శ్రీవారి ఆలయంలో జరుగుతున్నటువంటి వివిధ సేవలు, సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం, తిరుమల యొక్క ఇతిహాసం, చరిత్రను తెలుసుకొనడం కోసం 1819లో ఈస్ట్ ఇండియా కంపెనీ 14 ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలను రూపొందించింది. దీన్ని సవాల్- ఇ-జవాబు పట్టి అని పిలుస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news