ఏ మొహం పెట్టుకొని జనాల్లోకి వెళతారు?: శైలజానాథ్

-

మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. వైసీపీ అరాచక పాలన పై ప్రజలు తిరగబడే రోజు వచ్చిందని అన్నారు శైలజానాథ్. ఏం మొహం పెట్టుకుని ఓట్ల కోసం జనాల్లోకి వెళతారని ప్రశ్నించారు ఆయన. ప్రత్యేక హోదా సాధించడంలో పూర్తిగా విఫలం అయినందుకా? ప్రాజెక్టులు పూర్తి చేయనందుకా? అప్పులు చేస్తూ ప్రజల పై భారం మోపుతున్నందుకా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

అభివృద్ధి అంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బటన్ నొక్కడం కాదని విమర్శించారు. ప్రజలే బటన్ నొక్కి మిమ్మల్ని శాశ్వతంగా తాడేపల్లిలో కూర్చోబెడతారు అని అన్నారు.కాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే పొత్తుల వ్యవహారం హీట్ ఎక్కింది.ఈ పొత్తుల వ్యవహారం పై కూడా స్పందించారు శైలజానాథ్.పొత్తుల పంచాయతీని వదిలి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవుపలికారు శైలజానాథ్.

Read more RELATED
Recommended to you

Latest news