ఏపీలో దారుణం.. వివాహితపై గ్యాంగ్ రేప్

-

ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. ఏలూరులో శుక్రవారం అర్ధరాత్రి ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  భర్తతో కలిసి మద్యం తాగిన కొందరు యువకులు ఆ తర్వాత అతన్ని కొట్టి భార్యపై సామూహిక అత్యాచారం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి, అతని రెండో భార్య ఏలూరు వన్‌టౌన్‌ రామకోటి ప్రాంతంలో ఉంటుండగా.. నగరానికి చెందిన ముగ్గురు యువకులు వారికి పరిచయమయ్యారు.  శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు యువకులు, అతడు కలిసి మద్యం తాగారు. ఆ పక్కనే అతని భార్య నిద్రిస్తుండగా.. మద్యం మత్తులోయువకులు అతనిపై దాడి చేసి అతని భార్యను కొద్ది దూరం లాక్కెళ్లి అత్యాచారం చేశారు.  భర్త కేకలు వేస్తూ పక్కనే ఉన్న రోడ్డుపైకి వచ్చి అటుగా వెళ్తున్న యువకుడికి విషయం చెప్పగా.. అతడు అక్కడికి వస్తుండగా నిందితులు ముగ్గురూ పరారయ్యారు. ఈ ఘటనలో నిందితులు ముగ్గురినీ ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news