చంద్రబాబుతో యార్లగడ్డ భేటీ.. ఎల్లుండి TDPలో చేరిక

-

వైసీపీ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఇటీవల వైసిపికి గుడ్ బై చెప్పిన గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరనున్నారు. కొద్ది సేపటి క్రితం యార్లగడ్డ టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. టిడిపిలో చేరికపై చర్చించారు.

ఈనెల 22న లోకేష్ సమక్షంలో యార్లగడ్డ టిడిపిలో చేరనున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ… ఆరేళ్లుగా వైసీపీలో ఉన్నానని… మూడేళ్లుగా ఎన్నో ఎత్తుపల్లాలు చూసానని యార్లగడ్డ చెప్పారు. తన వర్గానికి ఏమీ చేయకుండానే… వైసిపి నుంచి బయటకు రావడం బాధ కలిగించిందన్నారు.

బేషరతుగా టీడీపీ పార్టీలో చేరుతానని… పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమన్న సిద్ధం అన్నారు. పార్టీ చెబితే గుడివాడ నుంచి అయిన పోటీ చేస్తానని.. రాజకీయాల్లోకి డబ్బు కోసం రాలేదని వెల్లడించారు యార్లగడ్డ వెంకట్రావు. త్వరలో పార్టీలో చేరుతున్నాను…రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చానని వెల్లడించారు యార్లగడ్డ వెంకట్రావు.

Read more RELATED
Recommended to you

Latest news