హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు

-

ఆదివారం సీఎం కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ హైవేపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా కోదాడ వైపు మళ్లిస్తున్నారు. అలాగే విజయవాడ నుండి వచ్చే వాహనాలను కోదాడ నుండి మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి మీదుగా మళ్ళిస్తున్నారు.

ఇక సూర్యాపేట పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం, జిల్లా ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు పలు ఆఫీసులను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన దృశ్య 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news