బీజేపీలో చేరిన YCP కార్పొరేటర్..!

-

పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి మరోసారి షాక్ తగిలింది. 39వ డివిజన్ కు చెందిన వైసీపీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ తాజాగా కూటమి ప్రభుత్వంలో భాగం అయిన బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ సమక్షంలో గాయత్రి నగర్ లోని పురందేశ్వరి నివాసంలో కాషాయ కండువా కప్పుకున్నారు కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర. అయితే ఇప్పటికే పశ్చిమ లోని వైసీపీ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, హర్షద్, మైలవరపు మాధురి లావణ్య, టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సమక్షంలో టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు తాజాగా గుడివాడ నరేంద్ర రాఘవ కూడ వేరే పార్టీలో చేరడంతో YCP లోని మిగితా వారిలో అనేకమంది కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే విజయవాడ అభివృద్ధి కోసం ఎవరు ముందుకు వచ్చినా కూటమి అండగా ఉంటుందని ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news